News November 19, 2025

సూర్యాపేట జిల్లా వాసికి అంతర్జాతీయ గుర్తింపు

image

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యా విభాగానికి చెందిన డా.రావుల కృష్ణయ్య పరిశోధక విద్యార్థిని సాక్షి సంయుక్తంగా చేసిన పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వారు రూపొందించిన పరిశోధనా పత్రం, జర్మన్ కమిషన్ ఫర్ యునెస్కో, జర్మన్ రెక్టర్స్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా జర్మనీలోని హానోవర్‌లో నవంబర్ 19-21 మధ్య నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో సమర్పణకు ఎంపికైంది.

Similar News

News April 5, 2026

మెదక్: 3 నెలల రేషన్.. 30 వరకు పంపిణీ

image

మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల సన్న బియ్యం సరఫరా జరుగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లబ్ధిదారులు తొందరపడకుండా ఈ నెల 30 వరకు సమీప రేషన్ దుకాణాల్లో సరుకులు పొందాలని సూచించారు. సరుకుల కొరత లేదని, పారదర్శకంగా పంపిణీ జరుగుతుందని చెప్పారు. వదంతులు నమ్మకుండా అవసరమైతే అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

News April 5, 2026

అనంత జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు

image

సీఎం చంద్రబాబు ఈనెల 6న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం పర్యటన షెడ్యూల్ వెల్లడించారు. ఉదయం 11:10 గంటలకు యాడికి మండలం వేములపాడుకు చేరుకొని మార్కెట్ యార్డ్‌లో జరిగే ‘ప్రజా వేదిక’లో పాల్గొంటారు. మధ్యాహ్నం పెండేకల్లు రిజర్వాయర్ వద్ద నీటి సంరక్షణ పనులను పరిశీలిస్తారు. అనంతరం వేములపాడులో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 4:20 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

News April 5, 2026

కామారెడ్డి: వరి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష నిర్వహించారు. MSP ప్రకారం గ్రేడ్-1 వరికి రూ.2,389, సాధారణ వరికి రూ.2,369కు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో తగిన సదుపాయాలు అందించాలన్నారు.