News November 18, 2025
సూర్యాపేట: డ్రోన్ చక్కర్లు.. పోలీసులకు ఫిర్యాదు

మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామ శివారులో 4 రోజులుగా డ్రోన్ కెమెరా చక్కర్లు కొడుతుండటంతో రైతులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో డ్రోన్ గ్రామం, పంట పొలాల మీదుగా తిరుగుతోంది. మహీంద్రా ఎస్యూవీలో వచ్చిన నలుగురు వ్యక్తులు ఈ డ్రోన్ను ఎగురవేశారు. వారిని ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో, స్థానికులు వారిని పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశారు.
Similar News
News November 18, 2025
మంచిర్యాలలో అమానవీయ ఘటన

మంచిర్యాలలో అమానవీయ ఘటన జరిగింది. సాయి హనుమాన్ నగర్కు చెందిన వృద్ధురాలు నాడెం రాజు ఆదివారం రాత్రి మృతి చెందింది. కుమార్తె లలిత పాత ఇంటిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పాత మంచిర్యాలలోని ఇంటికి తరలించింది. ఈ విషయం సీఐ ప్రమోద్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన జోక్యంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చారు. తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పంచుకునేందుకు అంగీకారం కుదరడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
News November 18, 2025
మంచిర్యాలలో అమానవీయ ఘటన

మంచిర్యాలలో అమానవీయ ఘటన జరిగింది. సాయి హనుమాన్ నగర్కు చెందిన వృద్ధురాలు నాడెం రాజు ఆదివారం రాత్రి మృతి చెందింది. కుమార్తె లలిత పాత ఇంటిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పాత మంచిర్యాలలోని ఇంటికి తరలించింది. ఈ విషయం సీఐ ప్రమోద్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన జోక్యంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చారు. తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పంచుకునేందుకు అంగీకారం కుదరడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
News November 18, 2025
కడుపులోనే కవలలు, భార్య మృతి.. భర్త ఆత్మహత్య

AP: అన్నమయ్య జిల్లాకు చెందిన విజయ్-శ్రావ్య దంపతుల కథ విషాదాంతమైంది. 8 ఏళ్ల క్రితం పెళ్లి కాగా HYDలో అద్దెకు ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో IVF ద్వారా శ్రావ్య గర్భం దాల్చింది. 8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్య కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా గర్భంలోని కవలలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా చనిపోయింది. ఈ విషాదాన్ని తట్టుకోలేని విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.


