News April 12, 2025
సూర్యాపేట: నీటి సంపులో పడి బాలుడి మృతి

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మోతె మండల పరిధిలోని గోపతండ గ్రామానికి చెందిన శివ, స్వరూప దంపతులకు చెందిన మూడేళ్ల బాలుడు భువనేశ్వర్ చౌహన్ శుక్రవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వెళ్లి నీటి సంపులో పడి మృతి చెందాడు. ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై బాలుడిని గమనించలేదు. ఈక్రమంలో విషాద ఘటన జరగింది. బాలుడి మృతితో తండాలో విషాదం అలుముకుంది.
Similar News
News July 9, 2025
నల్లబ్యాడ్జీలతో ఎన్టీపీసీ ఉద్యోగుల నిరసన

దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఐఏన్టీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ ఉద్యోగులు, నాయకులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నేషనల్ ఎస్సెట్ మానిటైజేషన్ పైప్లైన్ను రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టీకరణ నిలిపివేయాలని, పీఏస్యూల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
News July 9, 2025
గోదావరిఖని: సింగరేణి డైరెక్టర్ను కలిసిన అధికారుల సంఘం

సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రూను గోదావరిఖని క్యాంప్ ఆఫీస్లో సింగరేణి అధికారుల సంఘం ప్రతినిధులు ఈరోజు కలిశారు. నూతన డైరెక్టర్ (పా)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను సన్మానించారు. డైరెక్టర్ (పా) స్థాయిలో అధికారుల సంఘంతో గత నవంబర్లో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిన అంశాలపై విన్నవించారు. ఈ కార్యక్రమంలో పెద్ది నర్సింహులు, పొనగోటి శ్రీనివాస్, బి.మల్లేశం ఉన్నారు.
News July 9, 2025
గోదావరిఖని: దరఖాస్తు గడువు పొడిగింపు

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.బలరాం బుధవారం తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్లో పాసై మెయిన్స్కు హాజరవుతున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు.