News April 12, 2025
సూర్యాపేట: నీటి సంపులో పడి బాలుడి మృతి

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మోతె మండల పరిధిలోని గోపతండ గ్రామానికి చెందిన శివ, స్వరూప దంపతులకు చెందిన మూడేళ్ల బాలుడు భువనేశ్వర్ చౌహన్ శుక్రవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వెళ్లి నీటి సంపులో పడి మృతి చెందాడు. ఉదయం 9 గంటలకు తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై బాలుడిని గమనించలేదు. ఈక్రమంలో విషాద ఘటన జరగింది. బాలుడి మృతితో తండాలో విషాదం అలుముకుంది.
Similar News
News November 11, 2025
సనాతన ధర్మ భావాలను ఎగతాళి చేస్తే..: పవన్

AP: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల ఓ పుణ్యక్షేత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రం. ఆ లడ్డూకు ఎంతో పవిత్రత ఉంది. ఏడాదికి సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు వస్తుంటారు. విశ్వాసం, సనాతన ధర్మ భావాలను ఎవరైనా ఎగతాళి చేస్తే అది ఆధ్యాత్మిక నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని ట్వీట్ చేశారు.
News November 11, 2025
HYD: అందెశ్రీని KCR అవమానిస్తే సీఎం గౌరవించారు: చనగాని

ప్రముఖ కవి అందెశ్రీని మాజీ సీఎం కేసీఆర్ అవమానిస్తే సీఎం రేవంత్ రెడ్డి గౌరవించారని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ‘ప్రజాపాలనలో సీఎం అందెశ్రీ పాటను గౌరవించి తెలంగాణ రాష్ట్ర గేయంగా మార్చారు. BRS హయాంలో ఉద్యమకారులకు గౌరవం దక్కలేదు. ప్రజా గాయకులు గద్దర్, అందెశ్రీని ప్రభుత్వం గౌరవించింది. సీఎం స్వయంగా అందెశ్రీ పాడె మోయడం అంటే ఆయన త్యాగాలను గౌరవించడమే’ అని అన్నారు.
News November 11, 2025
సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NIGST), సర్వే ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBA, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, PhD ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, FRF పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: https://surveyofindia.gov.in


