News March 18, 2025
సూర్యాపేట: పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులకు స్క్వాడ్ విధులు

మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున స్క్వాడ్గా పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులకి విధులు కేటాయించామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు అందరూ తప్పకుండా పరీక్ష విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ వీవీ.అప్పారావు, డీఎంహెచ్వో కోటాచలం, డీఈవో అశోక్ ఉన్నారు.
Similar News
News March 18, 2025
వరికుంటపాడులో 84ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం

వరికుంటపాడులో 84 ఏళ్ల వృద్ధురాలిపై 34 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరికుంటపాడు ప్రధాన రహదారి వెంబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి లైంగిక దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News March 18, 2025
నేడు శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల

శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్ల లక్కీడీప్ కోటాను TTD ఈరోజు ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. డిప్లో టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20-22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనుంది.
News March 18, 2025
అన్నవరం-బాపట్ల కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలి

అన్నవరం నుంచి బాపట్ల వరకు కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ సోమవారం పార్లమెంటులో కోరారు.రైల్వే శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్పై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ విషయం లేవనెత్తారు. ఏపీలో 947 కిలోమీటర్ల సుధీర తీర ప్రాంతం ఉందని, ప్రధాన పోర్టు లు ఉన్నప్పటికీ రైల్వే కారిడార్ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. తన ప్రతిపాదన పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు.