News April 10, 2026

సూర్యాపేట: పంట మార్పిడిలో జిల్లా వెనుకంజ

image

జిల్లాలో పంటల వైవిధ్యం లోపించడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని 6.24 లక్షల ఎకరాల సాగు భూమిలో 92.5% కేవలం వరి, పత్తి పంటలే సాగవుతుండటంతో రాష్ట్రంలోనే జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఒకే రకమైన పంటల వల్ల భూసారం తగ్గి, పెట్టుబడి పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు పంట మార్పిడి చేపట్టి, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచిస్తున్నారు.

Similar News

News April 14, 2026

కూరగాయల పంటల్లో వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు

image

వైరస్ తెగుళ్ల కట్టడికి రసం పీల్చే పురుగులను నివారించడం ముఖ్యం. అలాగే రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాల ఎంపిక, పంట మార్పిడి, అంతర పంటలను సాగు చేయాలి. పంట పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న పంటలను కంచె పంటగా సాగు చేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. విత్తనం నాటే ముందు పొలానికి ట్రైకోడెర్మా, వేపపిండి కలిపి వేయడం, గుళికలమందు వాడకం, విత్తనశుద్ధి మంచి ఫలితాలిస్తాయి.

News April 14, 2026

గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

image

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.

News April 14, 2026

VJA: బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్!

image

బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రసాదంపాడుకు చెందిన రాజేశ్ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు. IPL ప్రారంభం అవ్వగానే సబ్ బుకీ అవతారమెత్తాడు. రాధే ఎక్సేంజ్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నాడు. అతనిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరిస్తున్న ఆనంద్ రెడ్డి, శివయ్యలను అదుపులోకి తీసుకున్నారు.