News September 20, 2025
సూర్యాపేట: పోలీసులకు ‘మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్స్’ పంపిణీ

ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు ఎస్పీ కె.నర్సింహ మెరిటోరియస్ సర్వీస్ రివార్డ్స్ను అందజేశారు. స్థానిక పోలీసు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దొంగతనం కేసులో చాకచక్యంగా వ్యవహరించి బంగారం రికవరీ చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్యలకు ఉత్తమ రివార్డులను అందజేశారు.
Similar News
News September 21, 2025
భట్టిప్రోలు వద్ద ప్రమాదం.. తండ్రీ కూతురు మృతి

ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలో శనివారం చోటుచేసుకుంది. SI శివయ్య తెలిపిన వివరాల మేరకు… రేపల్లెకు చెందిన చొక్కాకుల నాగసాయి అతని భార్య, ఇద్దరు పిల్లలు ద్విచక్ర వాహనంపై రేపల్లె నుంచి బాపట్ల వెళ్తుండగా కన్నెగంటివారిపాలెం హైవేపై తమ ముందు వెళ్తున్న ఒంటి ఎద్దు బండిని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నాగసాయి అతని కూతురు పల్లవి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.
News September 21, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో వైభవంగా రుద్రహోమం
✓ భద్రాద్రి: తల్లీ, కుమారుడు అదృశ్యం
✓ మణుగూరు: ఈవోతో భక్తుల వాగ్వాదం..!
✓ అశ్వారావుపేట సొసైటీ సీఈవో సస్పెన్షన్
✓ అశ్వారావుపేట పోలీసులపై దాడికి యత్నం.. వ్యక్తిపై కేసు
✓ సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వాలని సీఎంకు కొత్తగూడెం ఎమ్మెల్యే వినతి
✓ మణుగూరు: డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన
✓ కొత్తగూడెం: గంజాయి విక్రయదారుల అరెస్ట్
News September 21, 2025
కృష్ణా: ఆ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు..!

జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 3 వ్యక్తులు ఎమ్మెల్యేలుగా పాలన నడుస్తోంది. JSP MLA, ఆయన కుమారుడు, అల్లుడు వేర్వేరుగా వ్యవహారాలు చూసుకుంటున్నారు. అల్లుడు వ్యాపారం, కొడకు కేడర్, MLA అధికారులను డీల్ చేస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవులు మాత్రం టీడీపీ నేతలకే దక్కుతున్నాయని జనసేన శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు వాపోతున్నట్లు సమాచారం.