News September 23, 2025

సూర్యాపేట: ప్రజావాణిలో 11 ఫిర్యాదులు

image

ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 అర్జీలను ఆయన పరిశీలించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసు సేవలు పొందాలని ఆయన సూచించారు.

Similar News

News September 23, 2025

ఐఐఆర్ఎస్ఆర్ ఏర్పాటు ఇంకెప్పుడూ….?

image

టిష్యూ కల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేసి ఎర్రచందనాన్ని తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చే మొక్కగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖ 2022లో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎర్రచందన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంజూరు చేసినప్పటికీ, అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ల్యాబ్‌లో పరిశోధన దశలో ఉన్న ఎర్రచందనాన్ని రైతులు పెంచుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

News September 23, 2025

విశాఖలో రెండో రోజు జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు

image

నగరంలోని నోవాటెల్ హోటల్‌లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు రెండో రోజు కొనసాగింది. సదస్సులో భాగంగా ‘సివిల్ సర్వీసెస్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ అంశంపై మూడో ప్లీనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెక్రటరీ రష్మీ చౌదరి ప్రధాన వక్తగా వ్యవహరించారు. చర్చలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు పునీత్ యాదవ్, మోహన్ ఖంధార్, అహ్మద్ బాబు, ఎస్.సాంబశివరావు, పీయూష్ సింగ్లా పాల్గొన్నారు.

News September 23, 2025

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కు 3,01,321 క్యూసెక్కుల

image

SRSP నుంచి 3,01,321 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 వరద గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు అధికారులు చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,52,225 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 72.23 TMCల నీరు నిల్వ ఉంది.