News February 19, 2026
సూర్యాపేట: బడా నేతల వార్డుల్లోనూ BRSకు తప్పని ఓటమి

దశాబ్ద కాలంగా కీలక నామినేటెడ్ పదవులు అనుభవించిన బీఆర్ఎస్ నేతలకు ఈ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. జిల్లా స్థాయి బాధ్యతల్లో ఉన్న నేతతో పాటు, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ తమ సొంత వార్డుల్లోనూ పార్టీని గెలిపించుకోలేక పోయారు. మున్సిపల్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ల వార్డులైన 9, 36, 38లోనూ పార్టీకి పరాభవం తప్పలేదు. జడ్పీ వైస్ ఛైర్మన్ నివాసం ఉండే 46వ వార్డులోనూ ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
Similar News
News April 14, 2026
33 శాతం రిజర్వేషన్ ఆలస్యమైతే మహిళలకు అన్యాయం: మోదీ

చట్ట సభల్లోనూ మహిళలు బలంగా గళమెత్తేందుకు సమయం వచ్చేసిందని ప్రధాని మోదీ చెప్పారు. వారికి 33 శాతం సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశంలోని నారీమణులకు లేఖ రాశారు. ఏప్రిల్ 16 నుంచి 3 రోజులపాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ సవరణ బిల్లును ప్రవేశపెడతామన్నారు. దీనిపై ఆలస్యం జరిగితే మహిళలకు అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు.
News April 14, 2026
పసికూనపైనే కసికూన అరంగేట్రం!

అనుకున్నట్టే వైభవ్ సూర్యవంశీకి జాతీయ జట్టులోకి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జూన్లో జరిగే <<19624839>>ఐర్లాండ్<<>> టీ20 సిరీస్కు BCCI తాజాగా అతడి పేరును షార్ట్లిస్ట్లో చేర్చినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటనే తరువాయి కానుంది. ఇదే జరిగితే జాతీయ జట్టులో చేరిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బద్దలుకొట్టనున్నారు. ఇక పసికూన ఐర్లాండ్పై ఈ కసికూన ఎలా చెలరేగుతాడో చూడాలి.
News April 14, 2026
పూజాగదిలో తప్పనిసరిగా నీళ్లు ఎందుకు ఉండాలి?

పూజా గదిలో ఏదైనా ఓ పాత్రలో నీటిని తప్పక ఉంచాలని పండితులు సూచిస్తారు. తద్వారా దేవతలు సంతృప్తి చెందుతారని అంటారు. ‘మహా నైవేద్యం కంటే కూడా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా దేవతలు ఎక్కువ సంతోషిస్తారు. రాగి చెంబులో ఉంచిన మంచి నీరు మంత్ర శక్తి చేరిన జలంతో సమానం. ఆ నీరు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మార్చాలి. ఫలితంగా ఇంట్లో రుణ శక్తి దూరమై, దైవశక్తి పెరుగుతుంది’ అని చెబుతున్నారు.


