News March 27, 2025
సూర్యాపేట: బైక్ అదుపు తప్పి బాలుడి మృతి

బైక్ అదుపు తప్పి బాలుడు మృతిచెందిన ఘటన నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన బొప్పని రిషి (10) బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ మహేంద్రనాథ్ తెలిపిన వివరాలు.. పవన్ తన బావమరిది రిషితో కలిసి చిననెమిల క్రాస్ రోడ్ వైపు వెళుతున్నారు. బైక్ అదుపుతప్పడంతో రిషి చనిపోయాడు. బాలుడి తల్లి సుజాత ఫిర్యాదు మేరకు పవన్పై కేసు నమోదైంది.
Similar News
News July 6, 2025
NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.
News July 6, 2025
చిత్తూరు: పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీవో సుధాకరరావు తెలిపారు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ముస్లింవాడలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పనులు జరగకుండానే రూ.4,47,325 నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు డీపీవో తనిఖీల్లో నిర్ధారించారు. ఆ నివేదిక ప్రకారం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
News July 6, 2025
రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతి చెందిన ఘటన <<16957129>>కట్టంగూరులో <<>>జరిగింది. శాలిగౌరారం(M)ఊట్కూరుకు చెందిన పిట్టల శంకరమ్మ, ఆమెకుమారుడు రజనీకాంత్ HYDలో నివాసం ఉంటున్నారు. నకిరేకల్(M) ఓగోడులో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి బైక్పై HYD బయలుదేరారు. KTNG బిల్లంకానిగూడెం సమీపంలో లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన శంకరమ్మ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.