News November 17, 2025

సూర్యాపేట: భార్యను రోకలిబండతో బాది హత్య

image

మోతే మండలంలోని సిరికొండ గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కారింగుల వెంకన్న అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య పద్మ(40)ను రోకలి బండతో బాది హత్య చేశాడు. ఆవేశానికి లోనైన వెంకన్న బలంగా తలపై కొట్టడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న మోతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 17, 2025

బాపట్ల బీచ్ అభివృద్ధికి ఒప్పందం.. వెయ్యి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్

image

విశాఖపట్నంలో జరిగిన CII సదస్సులో గుంటూరు జిల్లా కి చెందిన భ్రమరా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. బాపట్ల సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతంలో సుమారు రూ.360 కోట్ల పెట్టుబడితో బీచ్ రిసార్ట్ నిర్మించేందుకు సంస్థ ఛైర్మన్ గల్లా రామచందర్రావు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

News November 17, 2025

పైరసీ సైట్లను ఎంకరేజ్ చేయవద్దు: సజ్జనార్

image

TG: ఐబొమ్మ రవి సినిమాలను పైరసీ చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశాడని HYD CP సజ్జనార్ తెలిపారు. ‘రవిని పోలీస్ కస్టడీకి కోరాం. విచారణలో పూర్తి వివరాలు రాబడతాం. పైరసీ చేసినా, చూసినా నేరమే. యూజర్ల డివైజ్‌లలోకి మాల్వేర్ పంపి వ్యక్తిగత డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి సైట్లను ఎంకరేజ్ చేయవద్దు’ అని సూచించారు.

News November 17, 2025

మెదక్: శీతాకాలం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ

image

మెదక్ జిల్లా పరిధిలో శీతాకాలం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సూచించారు. చలి తీవ్రత ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పేరుకు పోవడం వల్ల రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ సమయంలో ప్రమాదాలు జరగకుండా అన్ని వాహనదారులు స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, హై-బీమ్ వాడరాదని, లో-బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు.