News February 17, 2025
సూర్యాపేట: రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు

రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందు తమ కార్యాలయం నుంచి వెళ్లాడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి రెండో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల ప్రకారం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు విధుల నుంచి గంట ముందు వెళ్లే అనుమతి ఉంటుంది. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఉద్యోగుల వెసులుబాటు కోసం ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నారు.
Similar News
News February 14, 2026
BREAKING.. పటాన్చెరు: ORRపై యాక్సిడెంట్

పటాన్చెరు మండలం పోచారం ఔటర్ రింగ్ రోడ్ శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇంద్రేశానికి చెందిన ఎండి ముజీబుద్దీన్(28) అక్కడికక్కడే మృతి చెందగా.. స్నేహితులు అస్లాం, చంద్రశేఖర్, నిత్యానంద్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 14, 2026
కోస్టల్ కారిడార్లో మార్పులు

సవరించిన VMRDA మాస్టర్ ప్లాన్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అనుసంధాన బీచ్ కారిడార్కు స్వల్ప మార్పులు ప్రతిపాదించారు. కోస్టల్ బ్యాటరీ-కైలాసగిరి వరకు 40M, అక్కడి నుంచి భోగాపురం వరకు 60M వెడల్పుతో రహదారి ప్రతిపాదన, రాడిసన్ బ్లూ వద్ద ఎలివేటెడ్ మార్గం, మూలకుద్దు సమీపంలో ఐకానిక్ బ్రిడ్జి ప్రణాళికలో ఉన్నాయి. ఈ మార్పులు ట్రాఫిక్ సౌలభ్యం, పర్యాటక అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
News February 14, 2026
మక్తల్: టీచర్తో పోటీపడి గెలిచిన విద్యార్థి

నారాయణపేట జిల్లా మక్తల్ 14వ వార్డులో ఆసక్తికర పోరు జరిగింది. తనకు పాఠాలు నేర్పిన గురువుపైనే శిష్యురాలు మానస హనుమంతు (కాంగ్రెస్) విజయం సాధించారు. బీజేపీ తరఫున పోటీ చేసిన తన ఉపాధ్యాయురాలిపై 113 ఓట్ల మెజార్టీతో మానస గెలుపొందారు. ఈ అరుదైన విజయంపై స్థానికులు ‘గురువును మించిన శిష్యురాలు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


