News December 13, 2025
సూర్యాపేట: రెండో దఫా పల్లె పోరుకు తరలిన సిబ్బంది

రెండో దఫా ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో మొత్తం 8 మండలాల్లో ఆదివారం జీపీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు, కోదాడ, పెన్పహడ్, చివ్వేంల మండలాలకు ఎన్నికల సామగ్రితో పంపిణీ కేంద్రాల నుంచి సిబ్బంది ఆయా గ్రామాలకు బస్సుల్లో తరలి వెళ్లారు. అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News December 14, 2025
టుడే టాప్ స్టోరీస్

* AP CM చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు కొట్టివేత
* కేంద్ర మాజీమంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో కన్నుమూత
* మెస్సీ టీమ్పై గెలిచిన CM రేవంత్ జట్టు
* ₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి
* సంక్రాంతికి SEC నుంచి ప్రత్యేక రైళ్లు.. రేపు ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్
* ₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్
* దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం
News December 14, 2025
Kerala: కమ్యూనిస్టులకు ఎదురుదెబ్బ!

కేరళ స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల హవా కనిపించింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని అధికార LDFకు ఈ ఫలితాలు షాకిచ్చాయి. UDF(కాంగ్రెస్) బలం పుంజుకుంది. 6 కార్పొరేషన్లలో 4, 86 మున్సిపాలిటీల్లో 54, 941 పంచాయతీల్లో 504 స్థానాలను గెలుచుకుంది. LDFకు ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. మరోవైపు <<18552178>>తిరువనంతపురం<<>> కార్పొరేషన్లో NDA గెలిచింది. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు షాక్ తప్పదనే చర్చ సాగుతోంది.
News December 14, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సహకరించండి: డీఎస్పీ

మెదక్ జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రజలు, సిబ్బంది సహకరించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. శనివారం చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


