News February 27, 2025

సూర్యాపేట: వచ్చే ఏడాది ట్యాబ్‌ల ద్వారా టీచింగ్

image

న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. ఇప్పటికే సెలెక్ట్ చేసిన పాఠశాలలకు కంప్యూటర్ల సరఫరా ప్రారంభించగా త్వరలో ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లను అందించనున్నారు. ఈ లెక్కన ఎంపికైన 22 స్కూళ్లకు 550 ట్యాబ్‌లను సరఫరా చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటి ద్వారా బోధించనున్నారు.

Similar News

News February 27, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 60.65 శాతం పోలింగ్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 60.65 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 1415 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందన్నారు.

News February 27, 2025

IIT కాలేజీ స్క్రీన్‌పై పోర్న్: పిట్రోడాకు స్ట్రాంగ్ కౌంటర్

image

IIT రాంచీ వెబ్‌కాస్టులో మాట్లాడుతుండగా సిస్టమ్‌ను ఎవరో హ్యాక్ చేసి పోర్న్ ప్లే చేశారన్న శామ్ పిట్రోడా ఆరోపణలను EDU మినిస్ట్రీ ఖండించింది. ‘అసలు రాంచీలో IITనే లేదు. అక్కడుంది IIIT. పిట్రోడాను ఫిజికల్‌/డిజిటల్‌గా లెక్చరివ్వడానికి పిలవలేదని వారూ స్పష్టం చేశారు. దీన్ని బట్టి IITలను అపఖ్యాతి పాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. మేం దీనిని సహించం. లీగల్ యాక్షన్ తీసుకుంటాం’ అని ట్వీట్ చేసింది.

News February 27, 2025

మే 2న కేదార్‌నాథ్ ఆలయం ఓపెన్

image

చార్‌ధామ్ యాత్రలో కీలకమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ అధికారి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30న, బద్రీనాథ్ గుడిని మే 4న తెరవనున్నారు. ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్‌ధామ్‌గా పిలుస్తారు. మంచు, విపరీతమైన చలి కారణంగా ఈ ఆలయాలను సంవత్సరంలో కొన్ని నెలలే తెరుస్తారు.

error: Content is protected !!