News April 5, 2025
సూర్యాపేట: 3800 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ

సన్న బియ్యం పంపిణీలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 3800 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సుమారు 65 శాతం దుకాణాలకు తరలించామన్నారు. మిగిలిన 2200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు ఉన్నారు.
Similar News
News September 17, 2025
హత్య కేసులో దంపతులకు పదేళ్ల జైలు

పెద్దాపురం మండలం జి.రాగంపేటలో జరిగిన హత్య కేసులో భార్యాభర్తలకు పదేళ్ల జైలుశిక్ష పడినట్లు సీఐ విజయశంకర్ తెలిపారు. 2022లో ఆదిన ప్రసాద్, అతని భార్య లక్ష్మి పాలాని కలిసి మంగను ఇంటి మెట్లపై నుంచి తోసేశారు. దీంతో ఆమె మృతి చెందింది. మృతురాలి కూతురు పాపారాణి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ పి. శివశంకర్ కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు వారికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
News September 17, 2025
వికారాబాద్: చిరుత సంచారంతో భయం భయం

పెద్దెముల్ మండలం తట్టేపల్లి సిద్ధన్నమడుగు తాండ సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. జంతువు పాదముద్రలను చూసిన వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి సరస్వతి సిబ్బందితో కలిసి వచ్చి పాదముద్రలను పరిశీలించి అవి చిరుతపులివేనని ధృవీకరించారు. స్థానికులను రాత్రివేళలు లేదా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
News September 17, 2025
JNTUలో 198 ఎంటెక్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

JNTU యూనివర్సిటీలో ఎంటెక్ విభాగానికి సంబంధించి స్పాన్సర్ క్యాటగిరీలో స్పాట్ అడ్మిషన్లకు అధికారుల సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి 20 వరకు యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలో 198 సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.6 గంటల వరకు అడ్మిషన్లకు సంబంధించి ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన అన్నారు.