News October 3, 2024

సూళ్లూరుపేటలో వీఆర్వోపై ఇసుక మాఫియా దాడి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళా VROపై దాడి జరిగింది. సూళ్లూరుపేట(M) కాళంగి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఇలుపూరు దగ్గర వీఆర్వో శ్రీదేవి పట్టుకున్నారు. దానిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మన్నారుపోలూరు వద్ద ట్రాక్టర్ యజమాని వీఆర్వోని అడ్డగించారు. ఆమెను బెదిరించి ఫోన్ పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆమె వెంటనే ఎమ్మార్వోకు సమాచారం ఇవ్వగా.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News January 6, 2026

సూళ్లూరుపేట: ఇది ప్రకృతి హీరో..!

image

ఉప్పునీరు, చిత్తడి నేలలతో పులికాట్ జీవాన్ని దాచుకుంటుంది. ఆ జీవాన్ని ముందుగా గుర్తించేది నల్ల తల కొంగే. చెరువు అంచుల్లో పురుగులు, చిన్న జీవులను తింటూ పొలాలకు కనిపించని రక్షణ ఇస్తుంది. ఈ పక్షి లేకపోతే పురుగులు పెరుగుతాయి, పంట సమతుల్యత కోల్పోతుంది. మనుషులు గమనించకపోయినా, నల్ల తల కొంగ పులికాట్ జీవచక్రాన్ని నిలబెడుతుంది. అందుకే ఇది శబ్దంతో కాదు, అవసరంతో ప్రకృతి హీరో అవుతుంది.
#FLEMMINGOFESTIVAL

News January 6, 2026

నెల్లూరు: తెల్లవారుజామున రైలు కింద పడి సూసైడ్

image

మనుబోలు- గూడూరు రైల్వే స్టేషన్ మధ్య చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో మూడో రైల్వే లైన్‌పై మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వయస్సు 45-50 ఉంటుందని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. మృతుడు పచ్చ రంగు ఫుల్ హాండ్స్ షర్టు బులుగు రంగు గళ్ల లుంగి ధరించి ఉన్నాడు. కుడి చేతికి ఎర్రని దారం కట్టుకొని ఉన్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 6, 2026

కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు EPFO తప్పనిసరి : కలెక్టర్

image

నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో వచ్చే విధంగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం వారి ఛాంబర్‌లో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PM-VBRY) అమలుపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పని చేస్తున్న కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో నమోదు చేయాలన్నారు.