News November 9, 2024
సూళ్లూరుపేట: రోడ్డు ప్రమాదంలో నేపాల్ వాసి మృతి

తడ మండలం పూడి గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నేపాల్ నుంచి వచ్చి పూడి గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్న దమ్మరే పరియర్ అనే వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. క్షతగాత్రునికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించాడు. పరియర్ భార్య సుశీల పరియర్ ఫిర్యాదుతో తడ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 18, 2026
5,35,499 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ: DMHO

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1-19 సం.లలోపు ఉన్న 5.75,806 పిల్లలలో 5,35,499 మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు DMHO డాక్టర్ వి.సుజాత తెలిపారు. మొత్తంగా 93% ప్రగతి సాధించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 24వ తేదీన ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
News February 18, 2026
కేంద్రీయ విద్యాలయంలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు రూరల్లోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దొరసానమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్, కార్యాలయ సిబ్బంది పోస్టులకు అర్హులైన వారు kothuru.kvs.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూలను ఈ నెల 23, 24న తేదీల్లో నిర్వహించనున్నామని చెప్పారు.
News February 18, 2026
నెల్లూరు: ఇలా చేస్తే రూ.5వేలు!

నెల్లూరు జిల్లాలో మై భారత్ యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి ఆకుల మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన 10 ఉత్తీర్ణులై 2025 ఏప్రిల్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండి 29 ఏళ్లు లోపు వారు అర్హులన్నారు. రూ. 5వేలు గౌరవ వేతనం ఉంటుందన్నారు. ఈనెల 20వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.


