News September 19, 2025
సెట్టూరులో ప్రిన్సిపల్పై విద్యార్థి దాడి

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.
Similar News
News September 19, 2025
కవితపై దాడి చేయాలని చూస్తున్నారు: రేవంత్

TG: CM రేవంత్ మీడియాతో చిట్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. ‘నేను కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఆమె కాంగ్రెస్లోకి వస్తానంటే ఒప్పుకోను. KCR, KTR, హరీశ్రావు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని ప్రజలు బహిష్కరించారు. కాళేశ్వరం విచారణ బాధ్యతను CBIకి అప్పగించి చాలా రోజులైనా కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? KTR ఏం చెప్తే కిషన్రెడ్డి అది చేస్తారు’ అని వ్యాఖ్యానించారు.
News September 19, 2025
అంకిత భావ సేవలతో పని చేయాలి: కలెక్టర్

రెవెన్యూ అధికారులు నిబద్ధత అంకిత భావ సేవలతో పని చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో రెవెన్యూ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జీవో నంబర్ 55 ప్రకారం దసరా సందర్భంగా మండపాలు రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News September 19, 2025
తొలి లేడీ లోకో పైలెట్కు ఘన సత్కారం

ఆసియాలోనే తొలిమహిళా లోకో పైలెట్ అయిన సురేఖయాదవ్ ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను డిపార్ట్మెంట్ సిబ్బంది, కుటుంబసభ్యులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో ఘనంగా సత్కరించారు. 1988లో ఉద్యోగంలో చేరిన సురేఖ గూడ్స్ రైళ్ల నుంచి ముంబైలోని ఐకానిక్ లోకల్ రైళ్లు, ప్రతిష్ఠాత్మక దక్కన్ క్వీన్ నుంచి ఆధునిక వందే భారత్ వరకు అన్ని రైళ్లను నడిపిన మొదటి మహళా లోకోపైలెట్గా గుర్తింపు తెచ్చుకున్నారు.