News September 9, 2025
సెప్టెంబర్ 15న సింహాచలం దర్శన సమయంలో మార్పులు

సింహాచలం వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో సెప్టెంబర్ 15న కృష్ణ జయంతి నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11:30 నుంచి 12:30 వరకు దర్శనాలు నిలిపివేశారు. అదేరోజు సాయంత్రం 6 గంటల నుంచి దర్శనాలు, ఆరాధన సేవ నిలిపివేసినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. సెప్టెంబర్ 16న సాయంత్రం 4:30 గంటలకు సింహాచలం రాజగోపురం వద్ద ఉట్ల ఉత్సవం నిర్వహించనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News September 9, 2025
మునిపల్లి: గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాల పాలైన ఘటనపై ఎస్పీ పారితోష్ పంకజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని పరిశీలించి హాస్టల్ విద్యార్థులను తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రిలో పరామర్శించారు.
News September 9, 2025
సిర్పూర్: తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్: ఆర్ఎస్పీ

ముఖ్యమంత్రి తెలంగాణ రైసింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కానీ తెలంగాణ రైసింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ అన్నారు. మంగళవారం సిర్పూర్ మండలం చిన్నమాలిని గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి సీతక్క సిర్పూర్ రోడ్లను ఎందుకు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు.
News September 9, 2025
కవిత TDPలోకి వస్తారా? లోకేశ్ ఏమన్నారంటే..

కల్వకుంట్ల కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు నారా లోకేశ్ స్పందించారు. ‘కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిది’ అని వ్యాఖ్యానించారు. తాను KTRను వివిధ సందర్భాల్లో కలిశానని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. NDA అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్ను అడగాలని మీడియా చిట్చాట్లో అన్నారు.