News December 9, 2025
సేవల్లో మార్పులకు శ్రీకారం: పవన్ కళ్యాణ్

పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన సుమారు 2,000 మంది ఉద్యోగులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు CK కన్వెన్షన్ హాల్లో సమావేశం కానున్నారు. ప్రజాసేవల మెరుగుదల, ఫీల్డ్ సమస్యలు, పరిపాలనా లోపాలపై నేరుగా చర్చించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదోన్నతులతో ఉత్సాహంతో ఉన్న ఉద్యోగుల ద్వారా ప్రజలకు సేవల ప్రమాణం పెంచడంపై పవన్ స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News December 30, 2025
‘12 గ్రేప్స్ థియరీ’.. ఈ సెంటిమెంట్ గురించి తెలుసా?

కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటూ పాటించే సెంటిమెంట్లలో ‘12 గ్రేప్స్ థియరీ’ ఒకటి. స్పెయిన్ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు నిమిషానికి ఒకటి చొప్పున 12 ద్రాక్ష పండ్లను తినాలి. ఒక్కో పండు ఏడాదిలోని ఒక్కో నెలకు సంకేతం. ఇలా తింటూ బలంగా సంకల్పించుకుంటే ఆ ఏడాదంతా అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్ముతుంటారు. న్యూఇయర్ వేళ SMలో ఈ మేనిఫెస్టేషన్ ట్రెండ్ వైరలవుతోంది.
News December 30, 2025
KNR: యూరియా సరఫరా నిరంతరం పర్యవేక్షించాలి

వ్యవసాయ అధికారులు ప్రతిరోజు మండల, క్లస్టర్ స్థాయిలో యూరియా సరఫరాను పర్యవేక్షించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో ఆమె మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా, వ్యవసాయశాఖ, కేంద్రప్రభుత్వ పథకాలు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై చర్చించారు.
News December 30, 2025
ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఏర్పాటు.. తుది నిర్ణయం

ప్రకాశం, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. మార్కాపురం జిల్లా పరిధిలో 21 మండలాలు ఉండగా, మార్కాపురం డివిజన్ పరిధిలో 15, కనిగిరి డివిజన్ పరిధిలో 6 మండలాలు ఉండనున్నాయి. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి మొత్తం 28 మండలాలు ఉండనుండగా.. కందుకూరి డివిజన్ పరిధిలో 7, ఒంగోలు పరిధిలో 11, అద్దంకి డివిజన్ పరిధిలో 10 మండలాలతో ఉండనుంది. రేపే కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు.


