News February 12, 2025
సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించండి.. డీకే అరుణ విజ్ఞప్తి

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ విషయమై బుధవారం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఇతర ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 13, 2025
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. విజిలెన్స్కు ACB రిపోర్ట్

TG: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్ కమిషన్కు అప్పగించింది. రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి రిపోర్ట్ చేరుతుంది. ఐఏఎస్ అధికారి అరవింద్, బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్పై తుది నివేదిక వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించే అవకాశముంది.
News September 13, 2025
KNR: ఘనంగా ‘బొడ్డెమ్మ సంబురం’ ఆరంభం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బొడ్డెమ్మ పండగ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. KNR(D) వీణవంక మం. నర్సింగాపూర్లోని హరిహర క్షేత్రం దేవస్థానంలో మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో మహిళలు శుక్రవారం బొడ్డెమ్మ పండగ వేడుకలను అట్టాహాసంగా ప్రారంభించారు. కాగా, ఈ వేడుకలో గౌరీ దేవీని ఆరాధిస్తామని, బొడ్డెమ్మ పండగ మట్టి, పూలతో ముడిపడిన ఓ ప్రకృతి పండగని వనితలన్నారు. మనిషికి, మట్టికి, ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు.
News September 13, 2025
కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ కలకలం

చేబ్రోలు (M) కొత్తరెడ్డిపాలెంలో మెలియాయిడోసిస్ లక్షణాలు ఒకరిలో బయటపడటంతో మండలంలో కలకలం రేపుతుంది. ఇప్పటికే జ్వరాలు ఉన్నవారికి రక్త పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి నెగిటివ్ వచ్చిందని మిగిలిన నలుగురికి కొకొయ్ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ కొత్తరెడ్డిపాలెంపై దృష్టి పెట్టింది.