News March 26, 2025
సైదాపూర్: వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఎవరికైనా జరిగిన విషయం చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 31, 2025
IPL: నేడు ముంబై, కోల్కతా పోరు

IPLలో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా రెండు వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇవాళ గెలవాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది. మరోవైపు కేకేఆర్ ఇప్పటివరకు రెండు మ్యాచులాడి ఒకదాంట్లో గెలిచి, మరొకటి ఓడింది. మళ్లీ విజయంతో గాడిలో పడాలని ఆ జట్టు భావిస్తోంది.
News March 31, 2025
DEJAVU: అప్పుడు.. ఇప్పుడు ఒకేలా..!

ఐపీఎల్లో CSK, RR మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 2023, 2025లో ఇరు జట్ల మధ్య ఒకే రీతిలో మ్యాచ్ జరిగింది. 2023లో CSK విజయానికి 21 రన్స్ అవసరం కాగా, 2025లో 20 రన్స్ అవసరమయ్యాయి. అప్పుడూ, ఇప్పుడూ క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు. అప్పుడు, ఇప్పుడూ బౌలర్ సందీప్ శర్మనే. అప్పుడు గెలిచింది, ఇప్పుడు గెలిచింది రాజస్థానే. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు ‘DEJAVU’ అంటే ఇదేనేమో అని కామెంట్లు చేస్తున్నారు.
News March 31, 2025
నాంపల్లి: జాతీయ కమిషన్ సభ్యుడిగా శ్రీనివాస్ నియామకం

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ నాంపల్లి మండల కేంద్రానికి చెందిన శిరందాసు శ్రీనివాస్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన శిరందాసు శ్రీనివాస్కి నాంపల్లి మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.