News July 26, 2024
సైనికుల స్ఫూర్తి దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది: గవర్నర్

‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కార్గిల్ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన భారత ఆర్మీ సైనికులకు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్భవన్ నుంచి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ మాతృభూమిని రక్షించుకోవడానికి కార్గిల్ యుద్ధంలో సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ధైర్యంగా పోరాడారని గవర్నర్ కొనియాడారు.
Similar News
News October 31, 2025
తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు: ఎస్పీ హెచ్చరిక

పత్రికా స్వేచ్ఛ ముసుగులో ప్రభుత్వ వ్యవస్థలను అప్రతిష్ట పాలు చేసే చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సమయంలో అవనిగడ్డ మండలం రామకోటిపురం సర్పంచ్ను ఫొటో ఎగ్జిబిషన్ వద్ధకు రానివ్వలేదని ఓ పత్రిక ప్రచురించిన వార్తపై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంక్షలను వక్రీకరించి తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
News October 31, 2025
కృష్ణా జిల్లాలో పలు మండలాలకు క్రీడా సామాగ్రి సరఫరా

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పమిడిముక్కల, ఉయ్యూరు మండలాల క్లస్టర్ పాఠశాలలకు క్రీడా పరికరాలు సరఫరా చేయనున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష అధికారులు కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు రాంబాబు, అరుణ తెలిపారు. సంబంధిత మండలాల పీఈటీలు వారి క్లస్టర్కు కేటాయించిన స్పోర్ట్స్ మెటీరియల్ను స్వీకరించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News October 30, 2025
కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.


