News August 15, 2025

సైబరాబాద్ కమిషనరేట్‌ ఆఫీస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈరోజు గచ్చిబౌలి పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది గొప్ప వ్యక్తులు చేసిన అపారమైన త్యాగాలను ఆయన కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు.

Similar News

News August 15, 2025

HYD: తాగునీటి సరఫరా చేసే ముందు పరీక్షలు చేయాలి: MD

image

HYDలో తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే ముందు క‌చ్చితంగా నాణ్య‌త‌ను ప‌రీక్షించాల‌ని అధికారుల‌ను జలమండలి MD అశోక్ రెడ్డి ఆదేశించారు. ఎక్క‌డా తాగునీరు క‌లుషితం కాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. బ‌స్తీలు, లోతట్టు ప్రాంతాలపై మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. క్లోరిన్ బిల్ల‌ల‌ను ఇంటింటికీ పంపిణీ చేసి, వాటిని వినియోగించి నీటిని శుద్ధి చేసుకునే తీరుపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు.

News August 15, 2025

HYD: స‌హ‌జ‌వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి ల‌క్ష్యం కావాలి: కమిషనర్

image

సహజ వనరుల పరిరక్షణ అందరి లక్ష్యంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. అలా చేస్తేనే మెరుగైన జీవనం సాధ్యమని చెప్పారు. శుక్రవారం HYDలోని హైడ్రా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(జి)లో సహజ వనరుల సంరక్షణను ప్రస్తావించారని, దాని ప్రకారమే నగరంలోని గొలుసుకట్టు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు.

News August 15, 2025

ఎల్బీనగర్‌‌లో శ్రీకాంతాచారికి నివాళులు

image

తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా ఈరోజు HYD ఎల్బీనగర్‌ చౌరస్తా సమీపంలోని ఆయన విగ్రహానికి BRS నేతలు ఘనంగా నివాళులర్పించారు. MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఉద్యమ వీరుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.