News January 30, 2025
సైబర్ క్రైమ్ కేసుల్లో డబ్బులు రిఫండ్ అయ్యేలా చూడలి: ఎస్పీ

ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఫైబర్ క్రైమ్ కేసులదలో బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రిఫండ్ అయ్యే విధంగా చూడాలని సిబ్బందికి సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు రవీందర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.
Similar News
News November 10, 2025
అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.
News November 10, 2025
అవాస్తవాలు ప్రచారం చేయద్దు: పలమనేరు DSP

ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తిరుగు ప్రయాణంలో ఇందిరానగర్ వద్ద జరిగిన తోపులాటలో హేమలత అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిని కొంతమంది సోషల్ మీడియాలో కాన్వాయ్ వాహనం ఢీకొనిందని దుష్ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవమని DSP ప్రభాకర్ తెలిపారు. ఎవరైనా ఈ విషయంపై మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
News November 10, 2025
కర్నూలు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు: ఎస్పీ

కర్నూలు జిల్లాలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లాలో నేర నియంత్రణకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు, తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.


