News August 11, 2025

సైబర్ క్రైమ్..1.07 కోట్ల రికవరీ- SI శ్రావణ్ కుమార్

image

సైబర్ క్రైమ్ వచ్చిన కేసులలో మొత్తం రూ.1.07Cr రికవరీ చేసినట్లు మహబూబ్ నగర్ క్రైమ్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. జనవరి 2025 నుంచి 31-7-2025 వరకు మొత్తం 812 సైబర్ క్రైమ్ కేసులు వచ్చాయని, వాటిలో ఫైనాన్సియల్-627, నాన్ ఫైనాన్షియల్-185 కేసులు నమోదు అయ్యాయన్నారు. బాధితులు మొత్తం-4.49కోట్లు నష్టపోయారని, సైబర్ నేరగాళ్ల నుంచి 1.07Cr రికవరీ చేసినట్లు వెల్లడించారు.

Similar News

News November 9, 2025

MBNR: ఈనెల 12న అథ్లెటిక్స్ ఎంపికలు: శారదాబాయి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగాల్లో బాల, బాలికలకు అథ్లెటిక్స్ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. MBNRలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12న ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డులతో ఉదయం 9:00 గంటలలోపు పీడీ ఆనంద్ కుమార్‌కి రిపోర్ట్ చేయాలన్నారు.

News November 9, 2025

చౌక ధర దుకాణాలను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షాప్ నంబర్ 34లో డీలర్ కాకుండా మరొక వ్యక్తితో షాపును నడిపిస్తున్న కారణంగా ఆయనకు షోకేస్ నోటీసు ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ దుకాణాలు సమయానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఆదేశించారు.

News November 9, 2025

MBNR: తుప్పు పట్టిన 104 అంబులెన్స్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో దాదాపు ఆరు 104 అంబులెన్స్‌లు నిలుచున్న తోనే తుప్పు పట్టి తూట్లు పడుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదని ప్రజలు అంటున్నారు. డీఎంహెచ్వో కృష్ణయ్యను Way2News వివరణ అడగగా.. ఆ వాహనాలు వేలం కోసం ఉన్నాయని, వేలంలో అమ్ముతామని తెలిపారు.