News September 27, 2025

సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిన కావలి MLA

image

సైబర్ నేరగాళ్ల వలకు కావలి MLA కృష్ణారెడ్డి సైతం చిక్కుకున్నారు. గత నెల 25 తేదీ నుంచి ఈ నెల 16 లోపు ఆయన బ్యాంక్ ఖాతాల నుంచి రూ.23,16,009 నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన MLA రెండు రోజుల క్రితం కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. RTA బకాయిలు చెల్లించాలంటూ ఆగస్ట్ 22న వాట్సప్ నెంబర్‌కి వచ్చిన APK ఫైల్‌ను MLA టచ్ చేయడంతో సైబర్ నేరగాళ్ల వలకు ఆయన చిక్కారు.

Similar News

News September 27, 2025

నెల్లూరు: పేదలందరికి ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత గుల్ల !

image

గతంలో కట్టిన పేదలందరికి ఇళ్లు నిర్మాణంలో నాణ్యత తీసికట్టుగా మారింది. గతంలో 97,466 ఇల్లు మంజూరైనా వీటిలో 39,985 మాత్రమే పూర్తయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. లేబర్ ఏజెన్సీల పేరుతొ కట్టిన ఈఇళ్లు సిమెంట్ కన్నా ఇసుకే ఎక్కువగా కలిపి కట్టారు. నెల్లూరు అర్బన్, రూరల్, కావలి, బుచ్చి, ఆత్మకూరు ప్రాంతాల్లో ఈ తంతు జరిగినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News September 27, 2025

నెల్లూరు: ఉన్నా నిరూపయోగం..!

image

జిల్లాలో కొన్ని శాఖలకు సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతుంటే మరి కొన్నిచోట్ల కట్టిన ప్రభుత్వభవనాలను ఉపయోగించడంలో తాత్సారం కనిపిస్తుంది. నెల్లూరు వైద్య విద్యార్థుల కోసం సంగంలో ఏర్పాటు చేసిన శిక్షణభవనం(రూ.1.27 కోట్లు), కావలి ఏరియాఆస్పత్రిలో రూ.55 కోట్లతో నిర్మించిన గదులు, వింజమూరు(M) గుండెమడకలలో రూ.27లక్షలతో నిర్మించిన గ్రంధాలయం, సంతపేటలో రూ.3.82కోట్లతో నిర్మించిన ఘోష ఆసుపత్రి భవననాలు నిరూపయోగంగా మారాయి.

News September 27, 2025

విమానాశ్రయానికి భూసేకరణ సమస్య : GM పద్మ

image

దగదర్తి విమానాశ్రయానికి భూసేకరణే ప్రధాన సమస్యగా మారిందని విమానాశ్రయ అభివృద్ధి సంస్థ GM పద్మ అన్నారు. శుక్రవారం ఆ భూములను అదాని పోర్ట్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రన్ వే నిర్మాణనికి భూ సమస్య నెలకొందన్నారు. విమానాశ్రాయానికి రవాణా రహదారి, రైల్వే మార్గాల గురించి తహశీల్దార్ కృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతినిధి గౌరవ్ అదాని పాల్గొన్నారు.