News January 25, 2025
సైబర్ నేరాలపై అవగాహన అవసరం: పార్వతీపురం ఎస్పీ

ఐటీ, సైబర్ సెక్యూరిటీలపై యువతకు అవగాహన అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. జిల్లా వాసులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. OLX, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీ అప్డేట్ చేయాలంటూ వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని కోరారు. సైబర్ నేరాలకు గురైతే నంబర్ 1930ని సంప్రదించాలన్నారు.
Similar News
News February 22, 2026
అమలాపురం: రౌడీలకు పోలీసుల క్లాస్

జిల్లాలో రౌడీయిజం, గూండాయిజం అణచివేతకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. SP రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. పాత నేర చరిత్రను విస్మరించి, సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా జీవించాలని పోలీసులు సూచించారు. ప్రవర్తన మార్చుకోని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 22, 2026
ఉయ్యాలవాడకు నివాళులర్పించిన పోలీసులు

తెలుగునేల గర్వించదగ్గ తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి ఆదేశాలతో అదనపు ఎస్పీ వెంకటాద్రి, సిబ్బంది నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాలర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలు చేశారన్నారు.
News February 22, 2026
స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ (పర్సనల్) రాజీనామా ?

స్టీల్ ప్లాంట్లో డైరెక్టర్ (పర్సనల్)గా పనిచేస్తున్న రాకేశ్ నందన్ సహాయ్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 10న బాధ్యతలు స్వీకరించిన ఆయన తక్కువ వ్యవధిలోనే తప్పుకోవడంపై చర్చ నడుస్తోంది. గతంలో NTPC, Indian Oil Corporation, Coal India Limitedలో కీలక పదవుల్లో పనిచేశారు. స్టీల్ ప్లాంట్లో నెలకొన్న పరిపాలన పరిస్థితుల కారణంగానే ఆయన రాజీనామా చేసి ఉండవచ్చని కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతుంది.


