News February 7, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: అనకాపల్లి ఎస్పీ

సైబర్ నేరాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. గురువారం ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల సమస్యపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా జరక్కుండా చూడాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News November 8, 2025
19 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కొచ్చిలోని కస్టమ్స్ కమిషనర్ ఆఫీస్, రెవెన్యూ శాఖ 19 గ్రూప్-C కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ట్రేడ్స్మన్, సీమ్యాన్, గ్రేసర్, సీనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. సీనియర్ స్టోర్ కీపర్ పోస్టుకు 30ఏళ్లు. వెబ్సైట్: taxinformation.cbic.gov.in/
News November 8, 2025
హనుమాన్ చాలీసా భావం – 3

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||
ఆంజనేయుడు గొప్ప వీరుడు. సాటిలేని పరాక్రమవంతుడు. ఆయన దేహం వజ్రాయుధంలా దృఢమైనది. ఆయన భక్తుల చెడు ఆలోచనలను పూర్తిగా తొలగిస్తాడు. మంచి ఆలోచనలు గలవారి దగ్గరికి వెళ్లి, వారికి స్నేహితుడిగా ఉంటాడు. ఇన్ని సుగుణాలు గల హనుమాన్ను నిత్యం ధ్యానించడం వలన మనలో ధైర్యం పెరిగి, దుర్బుద్ధి తొలగి, సద్బుద్ధి పెరుగుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 8, 2025
గుండెల్లో మంటా?.. నిర్లక్ష్యం చేయొద్దు!

మసాలా ఫుడ్ తిన్న తర్వాత పలువురు గుండెల్లో మంటతో ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా ఒకసారి గుండెల్లో మంట వస్తే ఫర్వాలేదు. కానీ తరచూ అదే సమస్య ఎదురైతే చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే అన్నవాహిక సమస్య ఏర్పడుతుందని, కొన్ని సందర్భాలలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత అన్నవాహిక స్పింక్టర్ మూసుకోకపోవడం వల్లే గుండెల్లో మంట వస్తుందని వివరించారు.


