News February 20, 2026
సైబర్ మోసాలపట్ల అవగాహన, అప్రమత్తతే ఆయుధం: VZM ఎస్పీ

సైబర్ మోసాల పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని విజయనగరం ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయం నుంచి మాట్లాడారు. మోసగాళ్లు చెప్పే మాయమాటల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. OTP, వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 22, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు

రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ ఛైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లాలో జరుగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.
News February 22, 2026
గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు: VZM SP

గంజాయి విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. జిల్లాలో గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ప్రలోభాలకు లోనుకాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గానీ 1972 నంబరుకు గానీ తెలియజేయాలని కోరారు.
News February 22, 2026
గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు: VZM SP

గంజాయి విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. జిల్లాలో గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ప్రలోభాలకు లోనుకాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గానీ 1972 నంబరుకు గానీ తెలియజేయాలని కోరారు.


