News January 15, 2026
సొంతూరు వెళ్లొస్తే మనుషుల్లో విశ్వాసం పెరుగుతుంది: CBN

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే సంప్రదాయం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సొంతింటికి వెళ్లొస్తే మనుషుల్లో విశ్వాసం పెరుగుతుందని నారావారిపల్లిలో మీడియాతో చెప్పారు. ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన కలుగుతుందని తెలిపారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, జీవనప్రమాణాలు మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి జరిగినట్లని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 28, 2026
‘అజిత్’ రాజకీయ వారసులు ఎవరు?

మహారాష్ట్ర Dy CM అజిత్ పవార్ అకాలమృతి ఆయన రాజకీయ వారసత్వంపై ఊహాగానాలకు తెరతీసింది. కుమారుడు పార్థ్ లేదా భార్య సునేత్ర (రాజ్యసభ MP) పవార్ వారసత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బారామతి టెక్స్టైల్ కంపెనీ ఛైర్పర్సన్గా ఉన్న సునేత్ర గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. శరద్ పవార్ NCP నుంచి విడిపోయి అజిత్ BJP-శివసేన కూటమిలో చేరడం తెలిసిందే. కాగా వారసుల నిర్ణయాలు MH ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
News January 28, 2026
కడప జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: <
News January 28, 2026
‘పాక్.. మేం రెడీగా ఉన్నాం’.. ఐస్ల్యాండ్ ట్రోల్

T20 WCను బాయ్కాట్ చేస్తామని <<18966853>>బెదిరిస్తున్న<<>> పాకిస్థాన్ను ఐస్ల్యాండ్ క్రికెట్ బోర్డు ట్రోల్ చేసింది. పాక్ ప్లేస్లో తాము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. ‘WCలో పాక్ ఆడుతుందో లేదో త్వరగా చెబితే బాగుంటుంది. ఫిబ్రవరి 2న వారు వైదొలిగిన వెంటనే మేం బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. ఫిబ్రవరి 7న సరైన సమయానికి కొలంబోకు చేరుకోవడం కష్టమవుతుంది’ అంటూ రాసుకొచ్చింది.


