News August 9, 2024

సోంపేట: పలాసపురంలో డెంగీతో మహిళ మృతి

image

సోంపేట మండలం, పలాసపురం గ్రామానికి చెందిన సంక శోభ (38) డెంగీతో గురువారం మృతి చెందింది. కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూన్న ఆమెను గురువారం ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది. గతంలో ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు డెంగీతో మృతి చేందారు. మృతురాలికి భర్తతోపాటు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆసుపత్రిలోనూ ప్రాథమిక పరీక్షల కిట్లు లేక వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది అని గ్రామస్థులు వాపోతున్నారు.

Similar News

News February 23, 2026

నందిగాం: కళ్లల్లో కారం కొట్టి.. బంగారంతో పరార్

image

నందిగాం(M) నర్సాపురం గ్రామానికి చెందిన నెయ్యిల మహాలక్ష్మి మెడలో ఆదివారం బంగారం చైన్, పుస్తెలతాడు చోరీ జరిగింది. స్నానం కోసం గ్రామం శివారు చెరువుకు వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి మెడలో పుస్తెలతాడు, చైన్ తెంపుకెళ్లిపోయారని బాధితురాలు తెలిపింది. ఆమె భర్త పార్వతీశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 23, 2026

శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 19,850 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,019 మందితో కలిపి మొత్తం 39,869 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

News February 23, 2026

శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 19,850 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,019 మందితో కలిపి మొత్తం 39,869 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.