News April 1, 2025

సోమందేపల్లిలో ఘర్షణ.. ఒకరి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సాయినగర్‌లో మంగళవారం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అప్పు వ్యవహారంలో బావ మారి, బావమరిది నారాయణ ఘర్షణకు దిగారు. మారీ కర్రతో దాడి చేయడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘర్షణలో మృతుడు నారాయణ అన్న అంజికి గాయాలలైనట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News February 15, 2026

అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్: CM

image

TG: రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని CM రేవంత్ తెలిపారు. HYDలో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ‘4నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నా. ఈ ప్రస్థానంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారు. భూముల గురించి, తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచించకూడదు. బాగా చదువుకుంటే మీ భవిష్యత్ తరాలు బాగుపడతాయి’ అని వ్యాఖ్యానించారు.

News February 15, 2026

MNCL: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు

image

కార్పొరేషన్ రాజకీయాల్లో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ బాట పట్టారు. MNCL 23వ డివిజన్ కార్పొరేటర్ శంకర్, 45వ డివిజన్ సునీత, 47వ డివిజన్ సాయికృష్ణ ఆదివారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. చేరికను వారు స్వయంగా ధ్రువీకరించారు. వీరితో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా త్వరలో హస్తం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

News February 15, 2026

భద్రాద్రి: పండుగ పూట విషాదం.. యువకుడి దుర్మరణం

image

మహాశివరాత్రి పర్వదినాన మణుగూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కట్టు ఉడతనేని గుంపు ప్రాంత శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరుప సుదీర్‌(21) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పండుగ పూట చేతికి అందిన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.