News August 18, 2025

సోమశిల- శ్రీశైలం లాంచీ ప్రయాణం వాయిదా

image

రేపు ప్రారంభం చేయబోయే సోమశిల – శ్రీశైలం లాంచీ ప్రయాణం వాయిదా వేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లు ఎత్తారు. తిరుగు ప్రయాణంలో వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదని వాయిదా వేసినట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి 23వ తేదీన లాంచీ ప్రయాణాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

Similar News

News August 19, 2025

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి: కరీంనగర్ కలెక్టర్

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహాల్లో పెరుగుతున్న 3 ఏళ్ల పాపను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా USAకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. వీరికి ఇది వరకే బాబు జన్మించగా ఆడశిశువు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం విచారించి ఆడ శిశువును కలెక్టర్ సోమవారం దత్తత ఇచ్చారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

News August 19, 2025

ప్రజలను అప్రమత్తం చేయాలి: ఎస్పీ

image

వర్షాల వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదుల వద్ద పోలీస్ అధికారులు బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

News August 19, 2025

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వరకు 310.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారిగా పలిమెల 64.3 మి.మీ, మహముత్తారం 27.0 మి.మీ, మహాదేవపూర్ 17.4, మి.మీ, కాటారం 21.2 మి.మీ, మల్హర్ 21.0 మి.మీ, కొత్తపల్లి గోరి 17.5,చిట్యాల 19.5 మి.మీ, టేకుమట్ల 16.0 మి.మీ, మొగుళ్లపల్లి 15.0 మి.మీ, రేగొండ 14.0 మి.మీ, గణపురం 26.3 మి.మీ, భూపాలపల్లి 51.3 మి.మీ లుగా నమోదైంది.