News March 28, 2024
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: SP పరమేశ్వరరెడ్డి

సోషల్ మీడియాలో నిరాధార, వాస్తవ దూరమైన సమాచారం ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. తప్పుడు సమాచారం, బెదిరింపులకు పాల్పడే పోస్టులపై పూర్తి బాధ్యతను గ్రూప్ అడ్మిన్నే వహించాల్సి ఉంటుందన్నారు.
Similar News
News December 18, 2025
టంగుటూరు మర్డర్.. మృతుని వివరాలివే.!

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ హత్య జరిగిన విషయం తెలిసిందే. మృతుడు మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన వెంకటరమణయ్యగా పోలీసులు గుర్తించారు. రమణయ్య టంగుటూరు ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య చనిపోగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది.
News December 18, 2025
టంగుటూరులో వ్యక్తి మర్డర్..?

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ హత్యకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టంగుటూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే CI హజరతయ్య, SI నాగమల్లేశ్వరరావులు ఘటనా స్థలిని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ సైతం ఒంగోలు నుంచి రానున్నట్లు సమాచారం.
News December 18, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 388 మందికి కౌన్సెలింగ్

జిల్లా వ్యాప్తంగా 388 చెడునడత గల వ్యక్తులకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చెడునడత గల వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా అల్లర్ల సమయంలో వీరి జోక్యం కనిపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్యాలయం హెచ్చరించింది.


