News April 4, 2024
సోషియల్ మీడియాలో అసభ్య పోస్టులపై నిఘా ఉంచండి: సత్యసాయి ఎస్పీ

ఎన్నికలవేళ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వస్తున్న పోస్టులు పెడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోస్టులు పెట్టే వారు నిబంధనలకు లోబడి పోస్టు చేసుకోవాలన్నారు.
Similar News
News October 30, 2025
మహిళ సూసైడ్ అటెంప్ట్

గుత్తి మండలం అబ్బేదొడ్డినికి చెందిన శిరీష పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని శిరీషకు సూచించారు.
News October 29, 2025
అనంత జిల్లాలో 80.4 మి.మీ వర్షపాతం నమోదు

అనంత జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 80.4 మి.మీ కురిసింది. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 10.8 మి.మీ, ఎల్లనూరు 10.2, పుట్లూరు 9.8, గుత్తి 6.8, పెద్దవడుగూరు 6.0, యాడికి 5.0, నార్పల 4.8, పెద్దపప్పూరు 4.4, గార్లదిన్నె 4.0, BKS 3.0, గుంతకల్ 2.4, శింగనమల 2.4, కూడేరు 2.0, ఆత్మకూరు 2.0, అనంతపురం అర్బన్ 2.0, పామిడి 1.4, కళ్యాణదుర్గం 1.2, రాయదుర్గం మండలంలో 1.0 కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.
News October 29, 2025
గుత్తి: తుపాన్ ఎఫెక్ట్ ధర్మవరం – మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు రద్దు

మొంథా తుపాన్ ప్రభావంతో ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు సర్వీసును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. MTM – DMM వెళ్లనున్న రైలు సేవలు రద్దయ్యాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. బుధవారం ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (17215)ను కూడా రద్దు చేశామన్నారు.


