News June 12, 2024

సౌదీలో అనారోగ్యంతో రామారెడ్డి వాసి మృతి

image

సౌదీలో రామారెడ్డి వాసి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యునుస్(45) బతుకుదెరువు నిమిత్తం 10 రోజుల క్రితం సౌదీకి వెళ్లారు. అక్కడ మూడు రోజులు పని చేశాడని అనారోగ్యంతో మంచం పట్టి మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి ప్రభుత్వం తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Similar News

News February 10, 2025

NZB: చైనా ఫోన్‌లా రేవంత్ రెడ్డి పాలన: కవిత

image

KCR పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్‌లా ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఐఫోన్‌కు, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉంటదో.. కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి బురిడి కొట్టించారని ధ్వజమెత్తారు.

News February 10, 2025

NZB: BRS దుకాణం క్లోజ్: PCC అధ్యక్షుడు

image

తెలంగాణలో BRS దుకాణం క్లోజ్ ఆయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. BRSలో KTR- కవిత-హరీశ్ రావు మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని వ్యాఖ్యానించారు. సోమవారం PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని పశ్నించారు. కులగణన సర్వేలో పాల్గొనని KTR ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదన్నారు.

News February 10, 2025

బాల్కొండ: కాలువలో వ్యక్తి గల్లంతు.. వివరాలు ఇవే!

image

బాల్కొండ మండలం బుస్సాపూర్‌లోని ఇందిరమ్మ కాలువలో పడి <<152100>>వ్యక్తి<<>> గల్లంతయిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బీర్ సింగ్ మారాబి(40) బస్సాపూర్‌లో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కాగా ఆదివారం తన ఫోన్ రిపేర్ చేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆదివారం నీటిని నిలిపివేశారు.

error: Content is protected !!