News January 1, 2026

సౌదీలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష

image

సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు రికార్డు స్థాయికి చేరింది. 2025లో ఏకంగా 356 మందికి మరణ దండన అమలు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ రవాణాపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం శిక్షల్లో 243 డ్రగ్స్ కేసులే కావడం గమనార్హం. ఓవైపు పర్యాటకం, క్రీడలతో ఆధునిక దేశంగా ఎదగాలని యత్నిస్తున్న సౌదీ, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Similar News

News February 21, 2026

AUSWతో మ్యాచ్.. భారత్ స్కోర్ 176/6

image

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ 176/6 స్కోర్ చేసింది. స్మృతి మంధాన 55 బంతుల్లో 82(8 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా 59, రిచా ఘోష్ 18, షెఫాలీ వర్మ 7 రన్స్ చేశారు. టీమ్ ఇండియా చివరి 9 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. 3 టీ20ల సిరీస్‌లో IND, AUSలు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.

News February 21, 2026

చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం: సీఎం చంద్రబాబు

image

AP: YCP పాలనలో 108L మె.ట.ల చెత్త పేరుకుపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని CM CBN ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే చెత్తను తొలగిస్తున్నామన్నారు. పల్నాడు(D) వినుకొండలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’లో ఆయన ప్రసంగించారు. ‘మున్సిపాలిటీల్లో 97% చెత్త సేకరిస్తున్నాం. గ్రామాల్లో మార్చికల్లా 100% డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తాం. ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News February 21, 2026

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

image

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ప్రపంచం ముందు మనమంతా ఐక్యంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. రాజకీయ నాటకాలకు AI సమ్మిట్‌ను ఎంచుకోవడం సరికాదని BRS MLA కేటీఆర్ విమర్శించారు. INC కార్యకర్తలు CM రేవంత్ ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన చేపట్టారంటూ Xలో ఎద్దేవా చేశారు.