News January 1, 2026

సౌదీలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష

image

సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు రికార్డు స్థాయికి చేరింది. 2025లో ఏకంగా 356 మందికి మరణ దండన అమలు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ రవాణాపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం శిక్షల్లో 243 డ్రగ్స్ కేసులే కావడం గమనార్హం. ఓవైపు పర్యాటకం, క్రీడలతో ఆధునిక దేశంగా ఎదగాలని యత్నిస్తున్న సౌదీ, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Similar News

News January 4, 2026

పసి ప్రాణం తీసిన దుప్పటి.. తల్లి ప్రేమకు మిగిలింది కన్నీళ్లే!

image

వారణాసి (UP)లో గుండెల్ని పిండేసే విషాదం జరిగింది. రాహుల్ కుమార్, సుధా దేవి దంపతులకు 25 రోజుల క్రితం పుట్టిన పసికందు చలి తీవ్రతకు బలైంది. గడ్డకట్టే చలి నుంచి కాపాడాలని తనతో పాటు బిడ్డకూ మందమైన దుప్పటి కప్పి పడుకున్నారు. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి తెల్లారేసరికి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. పెళ్లైన 2ఏళ్లకు పుట్టిన తొలి బిడ్డ కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

News January 4, 2026

రెయిన్‌బో బేబీ అంటే ఏంటో తెలుసా?

image

వివిధ కారణాల వల్ల కొందరు పేరెంట్స్ ముందు బిడ్డను/బిడ్డలను కోల్పోతారు. ఆ తర్వాత పుట్టేవారిని రెయిన్‌బో బేబీ అంటారు. వైద్యులు ఈ రెయిన్‌బో బేబీస్ విషయంలో కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరిని కొంతకాలం ఆసుపత్రిలో ఉంచాల్సి రావచ్చు. ఇంద్రధనస్సు అనేది వర్షం తర్వాత కనిపించే అందమైన రంగుల సమ్మేళనం. అలాగే ఈ బేబీస్ తల్లిదండ్రులకు కొత్త జీవితాన్ని, ఆనందాన్ని ఇస్తారు. అందుకే వారిని రెయిన్‌బో బేబీస్ అంటారు.

News January 4, 2026

విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం

image

లిథియం బ్యాటరీల వల్ల అగ్నిప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్‌ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని DGCA నిషేధించింది. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు విమానాల్లో మంటలకు కారణమయ్యే అవకాశం ఉందని తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ముఖ్యంగా వీటిని ఓవర్‌హెడ్ బిన్లలో ఉంచినప్పుడు పొగ లేదా మంటలను గుర్తించడం కష్టమవుతుందని, ఇది విమాన భద్రతకు పెను ప్రమాదమని హెచ్చరించింది.