News July 10, 2024
సౌదీలో నూత్పల్లి వాసి మృతి.. కోటపాటిని కలిసిన కుటుంబ సభ్యులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720590111076-normal-WIFI.webp)
డొంకేశ్వర్ మండలం నూత్పల్లికి చెందిన సాయన్న సౌదీలో ఈనెల 4న మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయన్న మృతదేహాన్ని తొందరగా స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆర్మూర్లో ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడును కలిసి అభ్యర్థించారు. స్పందించిన కోటపాటి సౌదీ రాయబార కార్యాలయానికి కావలసిన సమాచారాన్ని పంపించామని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2025
NZB: అప్పుల బాధతో వాచ్మెన్ ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738940250122_50486028-normal-WIFI.webp)
అప్పుల బాధతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4 టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. నవీపేటకు చెందిన రేపన్ శంకర్ (58) ఎల్లమ్మ గుట్టలోని అమ్మ వెంచర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. కూతురు పెళ్లి, ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. అప్పు తీర్చలేక మనోవేదనకు గురై రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News February 8, 2025
NZB: యువకుడి ప్రాణం తీసిన ఇన్స్టాగ్రాం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738942043731_50486028-normal-WIFI.webp)
ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన మోపాల్లో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంజర గ్రామానికి చెందిన విశాల్(19) మరో ఇద్దరు స్నేహితుల మధ్య ఇంస్టాగ్రామ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో విశాల్ గత నెల 16న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
News February 8, 2025
NZB: ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738930865806_50139228-normal-WIFI.webp)
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన HMలు, MEOల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు.