News May 1, 2024
స్టార్ క్యాంపెయినర్గా కిమిడి నాగార్జున

సార్వత్రిక ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్గా పలు నియోజకవర్గాలకు టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను పార్టీ అధిష్టానం నియమించింది. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకుంటూ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార భాద్యతలను టీడీపీ అధినాయకత్వం అప్పగించింది.
Similar News
News April 21, 2025
VZM: 18 మందికి రూ.63లక్షల రుణాలు

విజయనగరం కలెక్టరేట్లో 18 మంది దివ్యాంగులకు రూ.63 లక్షల విలువగల రుణాలను కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం పంపిణీ చేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా డిగ్రీ ఆపై కోర్సులు రెగ్యులర్గా చదువుతున్న 29 మంది దివ్యాంగులకు 29 ల్యాప్టాప్లు, మూగ, చెముడు అభ్యర్థులకు ఆరు టచ్ ఫోన్లు, ట్రై సైకిళ్లను అందజేశారు.
News April 21, 2025
విజయనగరం పీజీఆర్ఎస్కు 205 వినతులు

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు 205 వినతులు అందాయి. కలెక్టర్ అంబేడ్కర్, JC సేతు మాధవన్, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 205 అర్జీలు అందగా, భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 138 వినతులు అందాయి. జేసీ సమీక్షిస్తూ గడువు లోపలే వినతులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
News April 21, 2025
చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

బాధితుల సమస్యలను తక్షణమే చట్ట పరిధిలో పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, 7 రోజుల్లో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆయన ఆదేశించారు. భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలు 2, మోసాలకు పాల్పడినవి 4, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.