News July 14, 2024

స్టీల్ ప్లాంట్‌లో ముడి సరుకు కొరతపై ఆందోళన

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ముడి సరుకు కొరత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఐరన్ లంప్స్ 3 రోజులకు, డొలమైట్ 3 రోజులకు, లైవ్ స్టోన్ 5 రోజులకు, ఎస్ఎంఎస్ లైవ్ స్టోన్ 5 రోజులకు ఇలా సగటున నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎండీసీ నుంచి అవసరమైన ముడి సరుకు విశాఖకు సరఫరా కావలసిన అవసరం ఉంది.

Similar News

News October 13, 2024

విశాఖ: చికెన్, మటన్ షాపుల ముందు బారులు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో చికెన్, మటన్ షాపుల ముందు పలుచోట్ల జనాలు బారులు తీరారు. విజయదశమి శనివారం రావడంతో జంతువధకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ఆదివారం భారీ స్థాయిలో మేకలు, గొర్రెలు, కోళ్లను అమ్మవారి ఆలయాల వద్ద వేట వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో మాంసం చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.250, స్కిన్ రూ.240, మటన్ రూ.1000కి విక్రయిస్తున్నారు.

News October 13, 2024

విశాఖ: ‘అల్పపీడనం ఏర్పడే అవకాశం’

image

ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశముందని వెల్లడించారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

News October 12, 2024

చివరి నిమిషంలో పరుగులు తీసిన ప్రయాణికులు

image

కొత్తవలస రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దసరా నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లు వేసిన సంగతి తెలిసిందే. విశాఖ నుంచి అరకు వెళ్లాల్సిన ప్రత్యేక రైలుకు మచిలీపట్నం టూ విశాఖ బోర్డు ఉండడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ కాదనుకొని వేచి చూస్తుండగా ప్లాట్ ఫామ్‌పై వ్యాపారాలు చేస్తున్న వారు అరకు రైలు అని చెప్పడంతో ట్రైన్ ఎక్కేందుకు పరుగులు తీశారు.