News January 16, 2026
స్టీల్ ప్లాంట్: కాలువలో ఉద్యోగి అనుమానాస్పద మృతి

స్టీల్ ప్లాంట్లోని కోపరేటివ్ స్టోర్స్లో అసిస్టెంట్గా పని చేస్తున్న సతీశ్ డీఏవీ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కాలువలో శవమై కనిపించడం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం కాలువలో మృతదేహం ఉన్నట్లు స్టీల్ ప్లాంట్ పోలీసులకు సమాచారం అందడంంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 22, 2026
AI ప్రయోజనాలు అందరికీ అందాలి: చంద్రబాబు

ప్రభుత్వ సేవలను మెరుగు పరిచేందుకు AIని వినియోగిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్లో AIపై నిర్వహించిన సెషన్లో ప్రసంగించారు. ‘AI కేవలం టెక్ కంపెనీలు, సిటీలకే పరిమితం కాకుడదు. ప్రతి పౌరుడు, రైతులు, విద్యార్థులు, ఎంటర్పెన్యూర్స్ అందరికీ దాని బెనిఫిట్స్ దక్కాలి’ అని తెలిపారు. మరో సెషన్లో రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ కోసం 20లక్షల ఎకరాలు, 18లక్షల మంది రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
News January 22, 2026
మెదక్: ఒంటరిగా జీవించలేక యువకుడి సూసైడ్

భార్యతో విడిపోయి ఒంటరిగా జీవించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టేక్మాల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపూలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో పెద్దల సమక్షంలో విడిపోయాడు. అప్పటి నుంచి మనస్తాపంతో తాగుడుకు బానిసైన ప్రశాంత్.. సోమవారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
News January 22, 2026
KMR: సమన్వయమే అసలైన సవాలు

కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రస్తుతం తిరుగులేని జోరు ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో అధికారంతో పాటు జిల్లా నేతలు ప్రభుత్వంలో ఉండటం పార్టీకి కొండంత బలాన్నిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతల వలసలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే భారీ చేరికలే పార్టీకి కొత్త తల నొప్పులు తెచ్చేలా ఉన్నాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదర్చడం ఇప్పుడు నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారింది.


