News August 27, 2025
స్టే.ఘ: యూరియా కోసం షాప్ల ముందు రైతుల పడిగాపులు

మునిగినా, తేలినా భూమినే నమ్ముకునే రైతులు ఎకరం సాగు చేయాడానికి నానా అవస్థలు పడుతున్నారు. రైతులకు సాగు కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. సాగు నీటి సమస్య, కూలీల సమస్య, గిట్టుబాటు ధర సమస్యతో పాటు ప్రభుత్వం స్పందిస్తే పరిష్కారం అయ్యే యూరియా సమస్యతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. మంగళవారం స్టే.ఘ. మండల శివునిపల్లిలో ఉదయం ఫర్టిలైజర్ షాప్ తీయకముందే షాపు ముందు వర్షం పడుతున్నా రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాశారు.
Similar News
News August 27, 2025
ఎల్లో అలర్ట్.. భారీ వర్షాలు

AP: అల్పపీడన ప్రభావంతో అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్లలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న శ్రీకాకుళంలో 16cm, కళింగపట్నం13.3cm, వైజాగ్లో 11.8cmల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
News August 27, 2025
DSCలో ఐదు ఉద్యోగాలు సాధించిన చేనేత కుమారుడు

ఉరవకొండకు చెందిన వరలక్ష్మి, ఎర్రిస్వామి కుమారుడు శ్రీనివాసులు ఇటీవలే విడుదలైన DSC ఫలితాలలో 5 ఉద్యోగాలు సాధించి తన ప్రతిభను కనబరిచారు. ఈ విజయం సాధించడానికి తన తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉందని అభ్యర్థి తెలిపారు. తను DSCలో SA, TGT మ్యాథ్స్, SA, TGT ఫిజిక్స్, TGT సైన్స్, SGT విభాగాలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులు చేనేతలు.
News August 27, 2025
జాతీయ అవార్డుకు ఎంపికైన జనగామ కవయిత్రి

తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్ పల్నాడులో తెలుగు తేజం జాతీయ పురస్కారాలు అందజేయనున్నారు. ఈ క్రమంలో జనగామకు చెందిన ప్రముఖ కవయిత్రి బుదారపు లావణ్య ఎంపికైనట్లు నిర్వాహక సంస్థ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక నిర్వహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు కవులు కవయిత్రులను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.