News August 17, 2025
స్త్రీ, శిశు సంక్షేమ అధికారులతో మంత్రి గుమ్మిడి సమీక్ష

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప.గో జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి పాలకొల్లు వచ్చిన సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సమగ్రంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా 1626 అంగన్వాడీ కేంద్రాల పని తీరు, పిల్లలకు అందుతున్న పోషకాహారం, విద్య, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News August 18, 2025
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ నాగరాణి

వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీని కారణంగా ఏపీకి మరో 3 రోజులు భారీ వర్షసూచన ఉన్నట్టు ప్రకటించిందన్నారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అధికారులకు సెలవులు రద్దు చేశామని తెలిపారు.
News August 17, 2025
ప.గో: రేపు పీజీఆర్ఎస్ రద్దు

అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ రానున్న మూడు రోజులు అధిక వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో రేపు 18న సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దు సమాచారాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించవలసిందిగా కలెక్టర్ కోరారు.
News August 17, 2025
నరసాపురం: అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

నరసాపురంలో తొమ్మిదేళ్ల బాలికపై ఈ నెల 13న అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేద తెలిపారు. శనివారం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. శనివారం కుడుపూడి నాగ బాలాజీని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని డీఎస్పీ తెలిపారు.