News March 28, 2024

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీ స్థాయిలో పోలింగ్

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాలలో 1439 మంది ఓటర్‌లకు గాను 1437 మంది ఓటర్‌లు (99.86%,) ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ ఎం.పి.డి. ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 245 మందికి 245 మంది ఓటర్‌లు 100 శాతం పోలింగ్ నమోదయ్యింది.

Similar News

News March 3, 2026

జడ్చర్ల: బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: అనిరుధ్ రెడ్డి

image

జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న విషయం తెలుసుకున్న MLA అనిరుధ్ రెడ్డి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడుతామన్నారు. ఘటనకు బాధ్యులైన సిబ్బంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.

News March 2, 2026

MBNR: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో హోలీ పండుగను సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బలవంతంగా రంగులు చల్లడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలు చేయరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్- 100 లేదా 8712659360 ను సంప్రదించాలని చెప్పారు. జిల్లా ప్రజలకు ఎస్పీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

News March 2, 2026

మన్యంకొండ: శ్రీ అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ

image

మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజపతాకాన్ని ఆవిష్కరించారు. ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.