News November 19, 2025
స్పోర్ట్స్ రౌండప్

☞ 100 టెస్టులు ఆడిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా ముష్ఫికర్ రహీమ్ రికార్డు
☞ పార్ట్ టైమ్ ఆల్రౌండర్లను టెస్టుల్లోకి తీసుకోవద్దు.. లేదంటే భారత్ WTC ఫైనల్కు చేరడం కష్టం: సునీల్ గవాస్కర్
☞ డెఫ్లింపిక్స్లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్కు రెండో గోల్డ్ మెడల్.. ఇటీవల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన శ్రీకాంత్, 10m మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ గోల్డ్ గెలిచాడు
Similar News
News March 27, 2026
ఏప్రిల్ 2న పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఛాన్స్: చంద్రబాబు

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్తుందన్నారు. కుదిరితే ఏప్రిల్ 2నే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అమరావతిపై జగన్ కుట్రలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సూచించారు.
News March 27, 2026
వీటి శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు

మేకప్ బ్రష్లు, స్పాంజ్లకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ వాటిని ఏడాదికి ఒకసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. మేకప్ టూల్స్ను దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే వాటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. అలాగే వీటిని రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. వేడి నీళ్లు, డిష్ వాషర్ సోప్, యాంటి బ్యాక్టీరియల్ సోప్, బేబీషాంపూతో వాటిని శుభ్రం చేసుకోవచ్చు.
News March 27, 2026
జీడిమామిడి పిక్కలకు అధిక ధర రావాలంటే..

చాలా మంది రైతులు జీడిమామిడి కాయలను పూర్తిగా పండకుండానే చెట్ల నుంచి తీసేస్తున్నారు. దీని వల్ల పిక్కల లోపల పప్పు పూర్తిగా తయారవ్వడంలేదు. ఫలితంగా మార్కెట్లో ఆశించిన ధర దక్కడం లేదు. అందుకే తోటల్లో పండు, పిక్కతో సహా కింద పడిన కాయలను మాత్రమే ఏరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్ల నుంచి పిక్కలను వేరు చేసి.. వాటిని 3 రోజుల పాటు ఎండలో ఆరబెడితే గింజలు మంచి బరువు ఉండి, అధిక ధర లభిస్తుంది.


