News October 16, 2025

స్వచ్ఛభారత్ మిషన్ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా చేపట్టవలసిన టాయిలెట్స్ నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. అధికారుల సమీక్షలో గురువారం కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 52 ప్రభుత్వ వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.5.73 కోట్లు మంజూరు చేశారన్నారు. నిర్దేశించిన సమయంలోగా అధికారులు పనులు పూర్తిచేయాలన్నారు.

Similar News

News October 17, 2025

విడిపోయినా కలవొచ్చు..

image

హిందూ వివాహ చట్టం-1955, సెక్షన్‌-9 ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి వివాహ బంధాన్ని పునరుద్ధరింపజేయమని కోరవచ్చు. సెక్షన్‌-10 ప్రకారం బంధం చెడకుండా విడివిడిగా ఉండటానికి న్యాయస్థానం ద్వారా అనుమతి కోరవచ్చు. న్యాయసేవల అధికారిక చట్టం ద్వారా స్త్రీలు, పిల్లలు ఉచిత న్యాయసేవలను పొందొచ్చు. ఎవరైనా మహిళను విచారణ జరిపేటప్పుడు ఆమె నివాసంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరపాలి.

News October 17, 2025

ఆందోల్: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

ఆందోల్ మండలం చింతకుంట గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై నుంచి ఇంటర్ విద్యార్థి దూకి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాళ్లపాడు గ్రామానికి చెందిన రాములు కుమారుడు జగన్ (17) ఇస్నాపూర్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్నాడు. జగన్ కళాశాలకు రావడంలేదని ప్రిన్సిపల్ ఫోన్ చేసి జగన్ తండ్రికి చెప్పడంతో మందలించాడు. మనస్థాపానికి గురైన జగన్ బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

News October 17, 2025

కర్నూలు మోదీ సభ హైలైట్స్

image

★ చంద్రబాబు నాయకత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ: పీఎం మోదీ
★ మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు: సీఎం
★ మోదీ ఓ కర్మయోగి.. మరో 15ఏళ్లు కూటమి పాలన: డిప్యూటీ సీఎం
★ ప్రధాని కోరినవన్నీ ఇస్తున్నారు: లోకేశ్
★ అఖండ భారతావని బాగుండాలని శ్రీశైలంలో మోదీ పూజలు
★ లోకేశ్‌కు ప్రధాని కితాబు.. సరదా ముచ్చట
★ ₹13,429 కోట్ల పనులకు శ్రీకారం
★ టైం అంటే టైం.. షెడ్యూల్ ప్రకారమే సాగిన పర్యటన
★ సభలో 2 లక్షల మంది పాల్గొన్నారని అంచనా