News August 7, 2025

స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధం కావాలి: కలెక్టర్

image

ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వేడుకల నిర్వహణపై గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులకు కేటాయించిన విధులను సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఆర్ఓ మోహన్ కుమార్, డీఎఫ్ఓ ధరణి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 9, 2025

త్వరలోనే ఏనుగుల సమస్యలకు పరిష్కారం: పవన్

image

ఏనుగుల గుంపుతో కన్నా ఒంటరి ఏనుగుతోనే ఎక్కువ ప్రమాదమని MLA అమర్‌నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన Dy.CM పవన్‌తో కలిసి పలమనేరులోని కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులు ‘ఏనుగులతో సమస్యలు వాటి పరిష్కార మార్గాలను’ వివరించారు. కుంకీ ఏనుగులతో ఒంటరి ఏనుగులకు చెక్ పెట్టవచ్చని, దీనికి సాంకేతిక తోడైతే మరింత ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, DFO పాల్గొన్నారు.

News November 8, 2025

వంద శాతం దీపం కనెక్షన్లు ఇచ్చాం: బాబు

image

1,291 కుటుంబాలకు LPG కనెక్షన్లు ఇచ్చామని CM చంద్రబాబు తెలిపారు. 37,324 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, 42,232 మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం అందించామన్నారు. P4 కింద 7,401 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చేశామని చెప్పారు. 7,489 SC, ST కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు ఈ నెలాఖరుకు పూర్తవుతుందన్నారు. 5 లక్షల లీటర్ల పాలు కుప్పంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతోందని ఇది 10 లక్షలకు చేరాలని కోరారు.

News November 8, 2025

చిత్తూరు: జర్నలిజం పేరుతో వేధింపులు తగదు

image

జర్నలిజం పేరుతో అధికారులను వేధించడం తగదని కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే విలేకరులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలలో సిబ్బంది నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం కల్పించడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఇద్దరు పాత్రికేయులు మహిళా ఉద్యోగులను బెదిరించిన సంఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిని విచారించి ఒకరి అక్రిడేషన్ రద్దు చేశామన్నారు.