News April 12, 2025
స్వామి, అమ్మవార్లు పూలమాలలు మార్చుకోవడమే ఎదుర్కోలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కల్యాణవేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.
Similar News
News December 28, 2025
పీఎం లంక నన్ను దత్తత తీసుకుంది: నిర్మల సీతారామన్

తాను పీఎం లంకను దత్తత తీసుకోలేదని, ఆ గ్రామస్థులే తనను దత్తత తీసుకున్నారని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఆదివారం అక్కడ జరిగిన సభలో ఆమె మాట్లాడారు. మహిళల మద్దతు మరువలేనిదని పేర్కొన్నారు. తీర ప్రాంత రక్షణ గోడ పనులు జనవరికి పూర్తవుతాయని, సముద్ర తీరం అందం దెబ్బతినకుండా పనులు చేపడుతున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల మత్స్యకార గ్రామాలకు రక్షణ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
News December 28, 2025
25,487 కానిస్టేబుల్ పోస్టులు.. 3రోజులే

కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలున్నాయి. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, PST/PET, వైద్య పరీక్షలు, DV ద్వారా ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది FEB-ఏప్రిల్లో CBT ఉంటుంది. మరోవైపు దరఖాస్తుల గడువు పొడిగించబోమని SSC స్పష్టం చేసింది.
Website: <
News December 28, 2025
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సంగారెడ్డి ఎస్పీ

న్యూ ఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా పోలీసుల పహారా మొదలవుతుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు ముమ్మరం చేస్తామని, వేడుకల పేరిట హద్దులు దాటొద్దన్నారు.


