News April 4, 2025

స్విమ్స్‌కు జాతీయ ప్రాముఖ్యత హోదా ఇవ్వండి: ఎంపీ

image

రాయలసీమ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న తిరుపతి స్విమ్స్‌కు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా పరిగణించాలని ఎంపీ గురుమూర్తి కోరారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేసే అవకాశం వస్తుందన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాల అభివృద్ధి, నూతన పరిశోధన ప్రయోగశాలలు, వైద్య పరికరాలకు నిధులు వస్తాయన్నారు.

Similar News

News February 13, 2026

‘జైలర్-2’ రిలీజ్ డేట్ అదేనా?

image

రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘జైలర్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘జైలర్-2’ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, శివ రాజ్ కుమార్, మోహన్‌లాల్ తదితరులు నటిస్తున్నారు. షారుఖ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

News February 13, 2026

కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కోసం లోకేశ్ ఆత్మీయ విందు

image

మంత్రి లోకేశ్ కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కుటుంబాల కోసం నిర్వహించిన ఆత్మీయ విందు రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిందని మంత్రి కొల్లు కొనియాడారు. నిరంతరం ప్రజాసేవలో తలమునకలయ్యే నాయకుల కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం లోకేశ్‌కే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విందు కార్యక్రమం కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచిందని, ఇలాంటి నాయకత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News February 13, 2026

తిరుపతి: మొన్న రిమూవ్.. నిన్న రిలీవ్!

image

TTD ఎస్వీ వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్ వ్యవహారం మలుపులు తిరిగింది. రిజిస్ట్రార్ భాస్కరుడును ఈనెల 4న రిమూవ్ చేసినట్లు VC ఉత్తర్వులు ఇచ్చారు. వారం రోజులు అదే సీటులో ఉండగా 11న పదవి కాలం ముగియడంతో రిలీజ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక రిమూవ్ చేసిన రోజు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఒక్కరికి ఇవ్వగా.. రిలీవ్ రోజు మరొకరికి ఇన్‌ఛార్జ్ ఇచ్చారు.