News February 10, 2025
హత్నూర: దౌల్తాబాద్ విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఆదివారం నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ 9వ తరగతి విద్యార్థులు నవాజ్, భవానీ, అన్విత క్రియ ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజాస్టర్ నమూనాకు రూ. 30 వేల బహుమతి అందుకున్నారు. వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయుడు వెంకటేశంను కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందించారు.
Similar News
News April 17, 2026
స్వీయ గణనతో తొలిదశ డేటా: కలెక్టర్

ప్రతి ఒక్కరూ డిజిటల్ జనగణన తొలి దశలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణనలో ఉత్సాహంగా పాల్గొని తమ ఇంటి నుంచే సమాచారాన్ని నమోదు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సెన్సస్-2027కు సంబంధించి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సెన్సస్–2027కు సంబంధించిన తొలిదశపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు.
News April 17, 2026
ADB: అడవి బిడ్డలకు తప్పని ‘బాట’ కష్టాలు!

ఉమ్మడి జిల్లాలోని 224 ఆవాసాలకు నేటికీ రహదారి సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. ASFలోని 86, ADB 69, MNCL 42, NRMLలోని 27 గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వర్షాకాలంలో వాగులు పొంగితే బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. మంగి, గుండాల వంటి ప్రాంతాలకు కనీసం నడిచే దారి కూడా లేదు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు దాటినా తమ బతుకుల్లో వెలుగు నింపే నాథుడే లేడని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 17, 2026
లోక్సభ నియోజకవర్గంగా అమరావతి!

AP: డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో LS స్థానాలు 38కి చేరుతాయి. దీంతో ప్రస్తుత 25 సీట్లతో పాటు మరో 13 ఏర్పాటవుతాయి. నియోజకవర్గాల పరిధులూ మారుతాయి. రాజధానిగా చట్టబద్ధ హోదా దక్కిన అమరావతి కొత్త నియోజకవర్గంగా అవతరించే అవకాశం ఉంది. గతంలోని తెనాలి, బొబ్బిలి, గుడివాడ, మార్కాపురం వంటి సీట్లు తిరిగి ఏర్పాటు కావచ్చని తెలుస్తోంది. 2011 జణగణన ప్రకారం చేస్తే ఒక్కో స్థానం పరిధిలో 13L జనాభా ఉంటారు.


