News February 10, 2025
హత్నూర: దౌల్తాబాద్ విద్యార్థుల ప్రతిభ
హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఆదివారం నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ 9వ తరగతి విద్యార్థులు నవాజ్, భవానీ, అన్విత క్రియ ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజాస్టర్ నమూనాకు రూ. 30 వేల బహుమతి అందుకున్నారు. వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయుడు వెంకటేశంను కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందించారు.
Similar News
News February 10, 2025
ఇలాంటి మోసం చూడలేదయ్యా!
విమానాల్లో విండో సీట్కు డిమాండ్ ఎక్కువ. అయినప్పటికీ చాలామంది ఇష్టంతో ఎక్కువ డబ్బులైనా చెల్లించి విండో సీటు బుక్ చేసుకుంటుంటారు. అలానే బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి ఇండిగో ఎయిర్లైన్ షాక్ ఇచ్చింది. అసలు కిటికీనే లేని విండో సీటు ఇచ్చారంటూ అతను చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. అతడు తమిళ స్టార్ స్పోర్ట్స్లో క్రికెట్ కామెంటేటర్ కావడంతో ట్వీట్ ట్రెండ్ అవుతోంది.
News February 10, 2025
వారికి శాశ్వతంగా ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే బొండా ఉమ
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందించేందుకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ సోమవారం ట్వీట్ చేశారు. ఈ మేరకు 20.10 లక్షల ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సౌరశక్తి ఉత్పత్తయ్యేలా పలకలు ఏర్పాటు చేశామని బొండా Xలో వెల్లడించారు.
News February 10, 2025
రాజమండ్రి: బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ.. ట్రాఫిక్ జామ్
రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ కొట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో సుమారు రెండు గంటలు పాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సిబ్బంది సకాలంలో చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు.